ఆంధ్రప్రదేశ్ తిరుపతి రుయా ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. రోగులు పట్ల ఎంతో దయగా వ్యవహరించాల్సిన అంబులెన్స్ సిబ్బంది మానవత్వం మరిచి.. డబ్బులు కోసం రాక్షసంగా ప్రవర్తించారు. అసలే బిడ్డను పొగొట్టుకుని.. తీరని కడుపుకోత అనుభవిస్తున్న వారిని డబ్బుల కోసం పీడించారు. ప్రస్తుతం ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఆ వివరాలు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటు ఓ బాలుడు మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలిసి.. అతడి తల్లిదండ్రులు గుండెలు […]