21 ఏళ్ల కుర్రాడు చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలైన్ దాటించాడు. బౌలర్ ఎవరైనా, బంతులు ఎలాంటివైనా లెక్కచేయలేదు. ఎంతమంది బౌలర్లను మార్చిన అతని బ్యాటింగ్పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. చూడచక్కటి షాట్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్ను రోహన్ పాటిల్ అనే కుర్రాడు కర్ణాటక టీ20 లీగ్లో ఆడాడు. మంగళవారం బెంగుళూరు బ్లాస్టర్స్, గుల్బర్గా మిస్టక్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రోహన్ చెలరేగిపోయాడు. […]