ప్రపంచంలోనే గొప్ప బౌలర్ గా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ సైతం.. సెహ్వాగ్ ను మించిన విధ్వంసక బ్యాటర్ ను చూడలేదు అంటుంటే.. నవీద్ మాత్రం వీరూను ఔట్ చేయడం పెద్ద విషయం కాదని తన అక్కసు వెళ్లగక్కాడు.
వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 15 న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రానా నవీద్ ఉల్ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.