ఐదేళ్ల క్రితం ఏపీలోని తుని ప్రాంతంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాపు ఉద్యమ జరుగుతున్న సమయంలో తుని స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు కొందరు మంటలు పెట్టారు. ఈ ఘటనలో తాజాగా తుది తీర్పు వెలువడింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.