అమరావతి- తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక 11 మంది చనిపోయిన ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి విజృంబిస్తున్నఈ సమయంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణమృదంగం మోగడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయాందోళకు గురిచేసింది. కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న రోగులు ఆక్సీజన్ అందక చనిపోయారని తెలిసిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రుయా ఘటనకు జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమనే విమర్శళు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహించి ఏపీ ముఖ్యమంత్రి […]