తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(public-private partnership)లో భాగంగా ఏర్పాటు చేయబడిన ఈ మల్టీప్లెక్స్.. లీజు బకాయిలను చెల్లించవలసి ఉందట. ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వం మల్టీప్లెక్స్ కోసం భూమిని ఇచ్చిందని, అందుకు మల్టీప్లెక్స్ ఆదాయంలో కొంత భాగాన్ని (ADP-అదనపు అభివృద్ధి ప్రీమియం) ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట. కానీ మల్టీప్లెక్స్ యాజమాన్యం గత కొన్నేళ్లుగా చెల్లింపులు జరపలేదని.. ఇప్పటివరకు సుమారు 27.45 […]