ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలను చేపట్టింది. ఇప్పటికే దాదాపు 18 లక్షలకు పైగా ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణ పనుల్లో కదలిక తెచ్చేందుకు లబ్థిదారులకు అడ్వాన్స్ గా రూ. 20 వేలు ప్రభుత్వం అందించనుంది.