ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడంలో పోలీసులది కీలక పాత్ర. సంఘ విద్రోహక శక్తులు, రౌడీమూకల నుంచి ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. అప్పుడప్పుడు పోలీసులు సైతం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. నిందితులను పట్టుకునే క్రమంలో కొందరు అమాయకులు బలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా పోలీసుల బూటు కాళ్ల కింద నాలుగు రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు.కరోనా కట్టడికై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్, కర్ఫ్యూలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఆంక్షల్లో భాగంగా ఏదైనా వేడుకలకు, శుభకార్యాలకు, కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. కొన్ని చోట్ల పెళ్లి చేసుకోవాలంటే అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ […]