సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏడాదిలానే గోదావరి జిల్లాలో కోళ్ల పందేలు జరుగుతున్నాయి. వాటికి తోడు ఈ సారి వైరటీగా పందుల కుస్తీలు పోటీలు కూడా జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని పందుల పోటీలను నిర్వహించారు. ఈ పందుల కుస్తీ పోటీలను చూడడానికి స్థానికులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు మాట్లాడుతూ.. తాము సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయానికి పెద్ద పీట వేసినట్లు […]