యాదాద్రి భువనగిరి జిల్లాలోని గొల్నేపల్లికి చెందిన మహిళ ఆన్లైన్ గేమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. దీంతో ఇంట్లో భర్తతో గొడవలు అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి రావడంతో భర్త ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులో తోసేసి తాను ఆత్మహత్య చేసుకుంది.