నేషనల్ డెస్క్- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం ఓల్డ్ సీమాపురిలోని ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం నలుగురు సజీవదహనమయ్యారు. ఉన్నట్లుండి భవనంపై అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఫైర్ యాక్సిడెంట్ లో ఇంటి యజమాని హౌరీ లాల్, ఆయన భార్య రీనా,, కుమారుడు అషు,, కుమార్తె రాధిక […]