పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యులు యర్రా నారాయణస్వామి బుధవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్య్లలతో బాధపడుతున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.