బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ను తొలి ఇన్నింగ్స్లో 227 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్లోనూ 231 పరుగులకే బంగ్లా ఇన్నింగ్స్ను చుట్టేశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా విజయానికి కేవలం 145 పరుగులే కావాలి. ప్రస్తుతం మూడో రోజు చివరి సెషన్ ఆట కొనసాగుతోంది. 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు […]