బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ను తొలి ఇన్నింగ్స్లో 227 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్లోనూ 231 పరుగులకే బంగ్లా ఇన్నింగ్స్ను చుట్టేశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా విజయానికి కేవలం 145 పరుగులే కావాలి. ప్రస్తుతం మూడో రోజు చివరి సెషన్ ఆట కొనసాగుతోంది. 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. ఆరంభంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ను కోల్పోయింది. రోహిత్ శర్మ గాయంతో టెస్టు సిరీస్కు దూరం కావడంతో కెప్టెన్గా వ్యవహరిస్తున్న రాహుల్.. కెప్టెన్గా సక్సెస్ అయినా ఆటగాడిగా విఫలం అవుతున్నాడు. తొలి టెస్టులో మొత్తం 45 రన్స్ చేసిన రాహుల్.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు.
వన్డౌన్లో వచ్చిన పుజారా సైతం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో 24 పరుగులు చేసిన టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ 72, అక్షర్ పటేల్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యారు. సాధారణంగా ఫీల్డ్లో చాలా అగ్రెసివ్గా ఉండే కోహ్లీ.. ప్రత్యర్థుల విషయంలో మరింత కఠినంగా ఉంటాడు. తాజాగా బంగ్లాదేశ్ ఆటగాళ్లను సైతం ఉపేక్షించలేదు కోహ్లీ. బంగ్లా ఆటగాళ్ల పిల్లచేష్టలకు మండిపోయిన కోహ్లీ.. భారీ సెటైర్ వేశాడు. రెండో రోజు ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు టైమ్ వేస్ట్ చేయడానికి ఒకసారి బ్యాట్ మారుస్తూ.. మరోసారి గ్లౌజ్లు మారుస్తూ.. బంగ్లా బ్యాటర్ నజ్ముల్ షాంటో టైమ్ వేస్ట్ చేసి.. రెండో రోజు చివరి నిమిషాల్లో వికెట్ పడకుండా ఉండేందుకు ఆటను తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
నజ్ముల్ పిల్లచేష్టలు చూసి చూసి విసుగెత్తిన విరాట్ కోహ్లీ.. ‘ఇంకా.. నీ షర్డ్ కూడా విప్పుకో..’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ చేసిన కామెంట్ వీడియోలో రికార్డు అయి అతను చెప్పిన మాటలు సైతం స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎలాగోలా టైమ్ వేస్ట్ చేస్తూ.. రెండు రోజు చివరి సెషన్ నెట్టుకొచ్చిన బంగ్లాదేశ్. మూడో రోజు 231 పరుగులకే ఆలౌట్.. టీమిండియా చాలా సాధారణమైన లక్ష్యం ఉంచింది. కేవలం 145 పరుగులు మాత్రం టీమిండియా ముందు టార్గెట్గా పెట్టగలిగింది బంగ్లాదేశ్. మరి ఈ టార్గెట్ను టీమిండియా మూడో రోజు ముగిస్తుందా.. లేక నాలుగో రోజు ఉదయం సెషన్లో పూర్తి చేస్తుందా? అనేది చూడాలి. మరి ఈ మ్యాచ్లో కోహ్లీ కామెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Guess Karo (@KuchNahiUkhada) December 23, 2022