భారతీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సామాన్యులకు ఉపశమనం కలిగించే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంక్ ఖాతాల్లో డబ్బు నిల్వలేనప్పుడు.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కింద బ్యాంకులు ప్రస్తుతం విధిస్తున్న చార్జీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.