నెల్లూరు- ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర కొనసాగుతోంది. మేకపాటి అంతియాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అంతకు ముందు మంగళవారం రాత్రి అమెరికా నుంచి మేకపాటి కుమారుడు నెల్లూరు చేరుకున్నారు. మేకపాటి కుమారుడు కృష్ణార్జున రెడ్డి అమెరికా నుంచి నేరుగా చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. రాత్రి 11 గంటల తర్వాత నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అప్పటికే మంత్రి మేకపాటి […]