మహిళల ప్రీమియర్ లీగ్లో పరుగుల వరద పారుతోంది. ఆడుతున్న తీరు.. పారుతోన్న బౌండరీలు చూస్తుంటే.. ఆడుతోంది అమ్మాయిలేనా అనిపిస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచులో ముంబై ఇండియన్స్ 207 పరుగులు చేసి ఔరా అనిపించగా.. రెండో మ్యాచ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఏకంగా 223 పరుగులు చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా మహిళా జట్టు గెలిచింది. ఈ టోర్నీలో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా తన పేరిట వరల్డ్ రికార్డ్ నమోదు చేసుకోవడం విశేషం.