పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియా దేశంలో విషాదం చోటు చేసుకుంది. చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారు. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిలో 11 మంది చిన్నారులతో పాటు ఓ గర్భిణీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియా దేశ రాజధాని శివార్లలోని పొరుగున ఉన్న న్యూ క్రూ టౌన్లో రాత్రి జరిగిన క్రిస్టియన్ ఆరాధన కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగిందని లైబీరియా డిప్యూటీ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి జలవా టోన్పో చెప్పారు. ఇది […]