నారాయణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రముఖమైన బిందువు శ్రీకృష్ణుడి వద్ద ఉంటుంది. ఎన్నో గొప్ప సిద్ధాంతాలను సులభంగా జీర్ణం చేసుకోగల జ్ఞానాన్ని కృష్ణుడు మనకు అందించాడు. శ్రీకృష్ణుడి ద్వారా వ్యక్తమైన భాగవతతత్వం భగవద్గీత భారతీయ తాత్వికతకు ఆత్మనిచ్చింది. అందుకే కృష్ణుడు […]