తెలంగాణ హైకోర్టులో హీరో వెంకటేష్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. వారి కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. దాంతో ఏళ్లుగా సాగుతున్న భూ వివాదానికి ముగింపు లభించింది. ఆ వివరాలు.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించిన వివాదంలో తాజాగా తెలంగాణ హైకోర్టు రామానాయుడి కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆ భూములు రామానాయుడి కుటుంబానికి చెందనవిగా తేల్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు కొట్టి వేసింది. […]