నేటి పోటీ ప్రపంచంలో ఒకరిని మించిన వారు మరొకరు ఉన్నారు. మంచి ఉద్యోగాలు పొందాలంటే మంచి విద్య అవసరం అని అంటారు. పదో తరగతి అనేది విద్యార్థి దశలో కీలకమైన మలుపు. ఈ కారణంతోనే పదవ తరగతి విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహిస్తుంటారు. తమ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటారు.