ఏడాది కాలంగా సాగుతోన్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు ముగిశాయి. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో పీవీ మార్గ్లో ఉన్న జ్ఞాన భూమిలో శతజయంతి ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ సై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెక్లెస్రోడ్ను పీవీ మార్గ్గా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా పీవీ నర్సింహారావు రచనలతో రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. ఎక్కడ ఏ పదవి లభించినా అక్కడ […]