హైదరాబాద్ : అవయవదానం ప్రాణదానంతో సమానమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. రవీంద్రభారతిలో శనివారం జరిగిన జీవన్ధన్ 11వ దాతల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అవయవదానం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మ నిచ్చిన […]