టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నేటి సాంకేతిక యుగంలో సమాచారం అంతా డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంది. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తమ హ్యాకింగ్ స్కిల్స్కి మరింత పదును పెడుతూ జనం ఖాతాల్లోని సొమ్మును, విలువైన సమాచారాన్ని అప్పనంగా కాజేస్తున్నారు. రోజుకో కొత్త రకమైన సైబర్ నేరాలు బయటపడుతున్నాయని, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారని అధికారులు అంటున్నారు. సైబర్ మోసానికి […]