టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నేటి సాంకేతిక యుగంలో సమాచారం అంతా డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంది. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తమ హ్యాకింగ్ స్కిల్స్కి మరింత పదును పెడుతూ జనం ఖాతాల్లోని సొమ్మును, విలువైన సమాచారాన్ని అప్పనంగా కాజేస్తున్నారు. రోజుకో కొత్త రకమైన సైబర్ నేరాలు బయటపడుతున్నాయని, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారని అధికారులు అంటున్నారు. సైబర్ మోసానికి ఓ బిజినెస్ మ్యాన్ ఘెరంగా మోసపోయాడు. వివరాల్లోకి వెళితే..
జీడిమెట్లకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 9 న ఆన్ లైన్ లో ఓ టీషర్ట్ కొన్నాడు. దీని ఖరీదు రూ.432.. అయితే దీని ట్రాన్సాక్షన్ గురించి తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఆ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు. ఆ వ్యక్తికి మొదట ఓ యువతి ఫోన్ చేసి కంగ్రాట్స్ తెలిపింది. మీరు రూ. 432తో టీ-షర్ట్స్ కొన్నారు కదా.. మీరు లక్కీ డ్రాలో రూ. 6.20 లక్షలు గెలుచుకున్నారని నమ్మించింది. అయితే కొన్ని సాధారణ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే మీ ఖాతాలోకి డబ్బు వస్తుందని చెప్పింది. తాను కొన్న టీ-షర్ట్ కి ఆరు లక్షలు రావడంతో ఉబ్బితబ్బిబై పోయాడు ఆ యువకుడు.
ఆ తర్వాత మరో ఇద్దరు కూడా అచ్చం ప్రొఫెషనల్స్ గా ఆ యువకుడితో మాట్లాడి మీరు రూ. 6.20 లక్షలు గెల్చుకున్నారు.. కంగ్రాట్స్ అంటూ ఫోన్ చేశారు. మొత్తానికి వీరి మాయమాటలో పడ్డట్టు గ్రహించిన సైబర్ నేరగాళ్ళు అతడి వద్ద నుంచి బ్యాంక్ డిటేల్స్ తెలుసుకొని కొన్ని చార్జీల పేరిట డబ్బులు తమ ఖాతాలో వేయించుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా అచ్చం ప్రొఫెషనల్స్ గా ఆ యువకుడితో మాట్లాడి మీరు రూ. 6.20 లక్షలు గెల్చుకున్నారు.. కంగ్రాట్స్ అంటూ ఫోన్ చేశారు.
మొత్తానికి వీరి మాయమాటలో పడ్డట్టు గ్రహించిన సైబర్ నేరగాళ్ళు అతడి వద్ద నుంచి బ్యాంక్ డిటేల్స్ తెలుసుకొని కొన్ని చార్జీల పేరిట డబ్బులు తమ ఖాతాలో వేయించుకున్నారు. మరో వ్యక్తి ఫోన్ చేసి మీరు అదనంగా రూ.10.41 లక్షల నగదు బహుమతిగా గెల్చుకున్నారని ఫోన్ చేశారు. ఆడబ్బులు మీ అకౌంట్ లో పడాలంటే.. రూ.1,09,000 కట్టాలని అడిగారు. ఇవన్నీ నమ్మిన ఆ యువకుడు మొత్తంగా వారి ఖాతాలో రూ.3,21,200 జమచేశాడు.
కొన్ని రోజులు తర్వాత తనకు ఎలాంటి డబ్బు రాకపోవడంతో తాను ఘోరంగా మోసపోయానని తెలుసుకొని లబో దిబో అన్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.