ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ అరుదైన వ్యాధుల బారినపడి అనారోగ్యానికి గురయ్యారు. గతేడాది సమంత, హంసా నందిని, మమత మోహన్ దాస్.. లాంటి చాలామంది సెలబ్రిటీలు హాస్పిటల్స్ లో చేరి చికిత్స కూడా పొందారు. ఈ నేపథ్యంలో తాజాగా హిందీ బుల్లితెర నటి, తెలుగు హీరోయిన్ అరుదైన వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో తెలియజేసింది.