సీజన్ మారినప్పుడు చాలా మంది అనారోగ్యం బారిన పడతారు. సీజనల్ వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు. ప్రస్తుతం చలికాలం పోయి వేసవి కాలం వచ్చింది. అయితే ఈ మార్పు వల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనబడితే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. కోవిడ్ 19 తర్వాత ఇదొక ట్రెండ్ గా మారింది. అయితే సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది.