డబ్ల్యూటీసీ ఫైనల్ ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో.. 296 పరుగుల టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఆసీస్ కి 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్టు అయ్యింది. నిజానికి ఒకానొక దశలో భారత్ 200 పరుగులు కూడా సాధించడం అసాధ్యంగా కనిపించింది. అలాంటి స్థితిలో రహానేకి జతకట్టిన శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బ్యాటింగ్ తో బాధ్యతను పంచుకున్నాడు.