కరీంనగర్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్కు 503 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 159 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 35 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 14 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల […]