ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వేసవి వేడి కంటే ఏపీలో రాజకీయ వేడిగా బాగా పెరిగిపోయింది. మఖ్యంగా లోకేశ్.. తన పాదయాత్రలో వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు.. రాజకీయ వేడిని ఇంకా పెంచుతున్నాయి.