కొన్ని రోజుల క్రితం అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. తాజాగా మరోసారి మాట్లాడారు.
వీధి కుక్కలను నగరవాసులు దత్తత తీసుకోవాలంటూ మేయర్ చేసిన వ్యాఖ్యలను వివాదాస్పద దర్శకుడు, ప్రముఖ నిర్మాత రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. మేయర్ విజయలక్ష్మీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. వర్మ. జంటనగరాల్లో కుక్కలను ఇంటికి తీసుకెళ్లి ఆహారం ఇవ్వాలంటూ ఆమెపై సెటైర్లు వేశారు.