ఎన్నికలు ప్రచారాలు, పర్యటనల సమయంలో ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ నేతలపై దాడులు జరుగుతుంటాయి. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన జపాన్ ప్రధాని షింజో అబేపై మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్లో పనిచేసిన దుండగుడు యమగామి టెట్సుయా కాల్పులు చేసిన సంగతి విదితమే. ఆ కాల్పుల ఘటనలో షింజో మరణించారు. ఈ ఘటన మర్చిపోక ముందే కొత్త ప్రధానిపై బాంబు దాడి జరిగింది.