అమెరికా- చైనా మధ్య నెలకొన్న అనిశ్చిత వాతావరణం వల్ల ఎన్నో సంస్థలు, తయారీ యూనిట్లు అయోమయంలో పడిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తైవాన్ కు చెందిన యాపిల్ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ తమ యూనిట్ ని చైనా నుంచి భారత్ తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్ లో మొత్తం రెండు తయారీ యూనిట్లు స్థాపించనున్నారు. ఇప్పటికే బెంగళూరులో ఒకటి స్థాపించనుండగా.. ఇప్పుడు మరో యూనిట్ ని తెలంగాణలో నెలకొల్పనున్నారు.