ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న గవర్నర్కు ఈ నెల 15న పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో 17న అత్యవసరంగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు. ఆదివారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. […]