హైదరాబాద్- తనకు కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమని ఈటల వ్యాఖ్యానించారు. షామీర్ పేటలోని తన నివాసంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందని ఈ సందర్బంగా ఈటల అన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్ తో […]