సాధారణంగా భక్తితో దేవుడికి మొక్కులు చెల్లించుకుంటే తమకు మంచి జరుగుతుందని అందరూ భావిస్తుంటారు. ముడుపులు కట్టి తమ ఇష్ట దైవానికి చెల్లించుకుంటారు. భారత దేశంలో దైవ భక్తి.. దైవ చింతన కలిగినవారు ఎక్కువగా ఉంటారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ‘ఖాందేవ్’ ఆలయంలో ఓ ఆదివాసీ మహిళ ‘నూనె మొక్కు’ చెల్లించుకుంది. తొడసం వంశీయుల సమక్షంలో మట్టి పాత్రలో 2.5 కిలోల నువ్వుల నూనెను ఒకేసారి తాగింది. మంగళవారం (జనవరి 18) ఖాందేవ్ జాతర సందర్భంగా […]