ప్రస్తుతం మనిషిని శాసిస్తున్నది డబ్బు అనడంలో సందేహం లేదు. కోటలు మేడలు కట్టాలన్నా ... కాటికి నలుగురు మోయాలన్నా గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా... ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి అని ఓ తెలుగు సినిమాలోని పాటలో మాదిరిగానే డబ్బు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. డబ్బు కోసం ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇతరుల దగ్గర తమ అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చే క్రమంలో ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడట్లేదు.