హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, […]