భారత్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. భారత్లోని పరిస్థితులు హృదయవిదారకమని ఉపాధ్యక్షురాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా మృతుల ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి. మరోవైపు ప్రాణవాయువు కొరత కారణంగా గాల్లో కలుస్తున్న ప్రాణాలు. ప్రస్తుత సంక్షోభ సమయంలో […]