హైదరాబాద్-వరంగల్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు వరంగల్ లో పర్యటించనున్నారు. పట్టణంలోని మహాత్మాగాంధీ సెమోరియల్ ఆస్పత్రిని ఈయన సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వార బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో దిగుతారు. అక్కడి నుంచి నేరుగా రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసానికి వెళ్తారు ముఖ్యమంత్రి. అనంతరం 11 గంటల 45 నిమిషాలకు సెంట్రల్ జైలుకు చేరుకుంటారు. […]