అమరావతి- ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రజకీయం భలే విచిత్రంగా సాగుతోంది. సొంత పార్టీ ఎంపీని ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ప్రతి పక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ను ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత […]