గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చిన్న పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మాస్కుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరం లేదని స్పష్టం చేసింది. 6 నుంచి 11 ఏళ్ల వయసు వారికి తల్లిదండ్రుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉపయోగించే మాస్కులు వాడాలని సూచించింది. 12 ఏళ్లు దాటిన వారికి మాస్క్ కచ్చితమని […]