ప్రస్తుత కాలంలో ఏదైనా మార్కెట్ కి పోతే.. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అనే పాట గుర్తుకు వస్తుంది. కరోనా తర్వాత నిత్యావసర సరుకులు ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి.. రాబడి కొంత అయితే.. ఖర్చులు కొండంతగా మారిపోయాయి. ఉప్పు.. పప్పు.. నూనె ప్రతీది సామాన్యులకు పెను భారంగా మారిపోయాయి.