గులాబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ తుఫాన్ వల్ల ఆస్తి నష్టమే కాకుండా పలు చోట్ల ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ చోట ప్రయాణికులు ఉన్న బస్సు నదిలో కొట్టుకుపోయింది. యావత్మాల్ జిల్లాలో వరదలో బస్సు కొట్టుకుపోయింది.. దాహగాం […]