ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులపై జరిగే దురాగతాలు ఆగడం లేదు. ఇతర దేశాల్లో తెలుగు విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన తేజస్విని అనే అమ్మాయిపై కత్తితో దాడి చేసి చంపాడు ఓ దుండగుడు. మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది.