ఈ మధ్యకాలంలో లోన్ యాప్ వేధింపులను భరించలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషమం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులను భరించలేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లాలోని బొల్లారం తాండాకు చెందిన సునీత అనే మహిళ గతంలో ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకుంది. కొన్ని నెలల పాటు డబ్బులు చెల్లిస్తూ వచ్చింది. […]