టోక్యో పారాలింపిక్స్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల టేబుల్ టెన్నిస్ ఫైనల్లో భవీనాబెన్ పటేల్ రజతం సాధించింది. పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్లో భారత్కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. ప్రపంచ టీటీ నంబర్ 2, నంబర్ 3 పెడ్లర్లను ఓడించి ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓటమి పాలైంది. పారాలింపిక్స్లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ […]