నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం తెల్లవారుజామున బహుదా నదిపై నిర్మించిన వంతెన కుప్పకూలింది. దీంతో దానిపై ఉన్న వాహనాలు నదిలో పడిపోయాయి.