అమరావతి-న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి దూసుకెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. కార్యాలయం ముందు పార్కింగ్లో ఉన్న వాహనాల అద్దాలు పగలగొట్టారు. విజయవాడలోని పట్టాభి రామ్ ఇంటిపై దాడులకు పాల్పడిన […]