ఏపీ పదోతరగతి ఫలితాలు రానే వచ్చాయి. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 38 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.